ఈ హెడ్డింగులో ‘బూతు’ కనిపిస్తే అది అక్షరాలా మీ దృష్టిదోషమే..! ! !


 

సాక్షిక్లిప్పింగ్ ఇది. ఈరోజు(11జులై, 2021) పేపర్లోది. సూటిగా చూడండి.‘ కృష్ణ తులాభారం’-అందరికీ తెలిసినదే. దాన్ని ప్రస్తుత కృష్ణా జలాల వివాదానికి అన్వయిస్తూ...అత్యుత్సాహంతో ష్ణాఅని దీర్ఘం ఇచ్చేసారు. ఎందుకు..?? ? అంటే..  ఇది శ్రీకృష్ణుడికి సంబంధించినది కాదు, ‘కృష్ణానదికి సంబంధించినది అని చెప్పడానికి. హెడ్డింగును వంకర దృష్టితో చూడండి. దీర్ఘంతో బూతుపదంలాగా కనిపిస్తే అది ఎవరి తప్పు...వంకరగా చూసినోళ్ళదే తప్ప మరెవరిదీ కాదని అనుకుందాం ప్రస్తుతానికి...  రంగుల్లో తేడా చూపించారులే అని సర్దుకుపోవడానికి వీల్లేకుండా  మరో పేజీలో రంగులు లేకుండా  రిపీట్ చేసారు...కాస్తలో కాస్త ఉపశమనం...తులా’ లో ‘ల’కు దీర్ఘం తీసేయలేదు, తరువాత స్పేస్ ఇవ్వలేదు. ఓవర్ ఆల్ గా వ్యాకరణ రీత్యా తప్పా ,  రైటా ?  అన్నది కాదు,  రాయడంలో పదాల మధ్య స్పేస్ ఇస్తాం. చదివేటప్పుడు అలా  కాకుండా ఏకబిగిన చదివేస్తాం.  అందువల్ల చూడంగానే,  చదవంగానే  రకరకాల భావనలకు, అర్థాలకు, పెడర్థాలకు  అవకాశమీయకుండా ఉంటే బాగుండేది.

 https://epaper.sakshi.com/c/61734507

 

ఇటువంటివి వార్తాపత్రికల్లో మామూలే... కాలంతో పోటీపడి పనిచేసేటప్పుడు ఆ సమయానికి తోచనివి ఇలా ప్రింటయి బయటికి వచ్చినప్పుడు ....ఎబ్బెట్టుగా కనిపిస్తాయి....అయితే దురుద్దేశంతో చేసినవి కావు కాబట్టి పాఠకులు సహృదయంతో సూటిగానే చూస్తారు తప్ప చూడమన్నా వంకరదృష్టితో చూడరు. ఒకవేళ చూపు ఆ వైపుకు వాలినా...కొద్దిసేపు ముసిముసిగా నవ్వుకుని క్షమించేస్తారు....సందర్భం వచ్చింది కాబట్టి వీరిని సమర్ధించడానికి ఇటువంటిదే  వెనకటి సంఘటన  ఒకటి ప్రస్తావిస్తా...

 

కంప్యూటర్లు లేని రోజులవి..  లెడ్ తో(సీసం-లోహం) చేసిన అక్షరాలను చేత్తో కూర్పు చేసే పని ( కంపోజింగ్ )అమల్లో ఉన్న రోజుల్లో...ఒక ప్రముఖ దిన పత్రిక ‘‘శ్రీశైలం  జల విద్యుచ్ఛక్తి....అని ఇలాగే తాటికాయంత అక్షరాల్లో 84 పాయింట్లో...బ్యానర్ వార్త (మొదటి పేజీ పైభాగంలో) సిద్ధం చేసింది. అర్ధరాత్రి ఫైనల్ గా మిషిన్ ప్రూఫ్ కూడా చూసేసిన న్యూస్ ఎడిటర్ -ప్రింటింగ్ కు ఆర్డరిచ్చి వెళ్ళిపోయాడు. ముద్రణా యంత్రాల దగ్గర సిబ్బంది... ఆ పేజీని ప్రింటింగ్ కు రెడీ చేస్తున్న క్రమంలో శ్రీశైలంతరువాత స్పేస్ గా ఉంచిన లెడ్ జారిపడిపోయింది. అక్కడి సహాయకుడు  వెంటనే అది గమనించి ప్రింటింగ్ కు ఆలస్యం అవుతున్నదన్న హడావిడిలో దాన్ని తీసుకెళ్ళి ‘శ్రీశైలం’ అనే పదంలో ... లంతరువాత ఉంచాల్సిన దాన్ని  శ్రీశైతరువాత గుచ్చేశాడు. దానితో.. తరువాత ఉన్న లంకాస్తా పక్కనే ఉన్న జలపదంతో కలిసిపోయింది. మొత్తంగా చూస్తే ఎలా కనిపిస్తుందో మీరే చూసుకోండి..సభ్యత అడ్డొస్తున్నది... 

ముద్రణలో జాగ్రత్తగా లేకపోతే ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయి కాబట్టే...ఇటువంటి వాటిని ముద్రారాక్షసాలు అంటాం.

వెనకటివి ఇంకా చాలా గుర్తుకొస్తున్నాయి....దీన్ని సాకుగా చేసుకుని అవన్నీ  ఇక్కడ ఏకరువు పెట్టడం భావ్యం కాదు...

అందుకే ఇటువంటివి జరగకుండా మరింత జాగ్రత్తపడాలని మీడియా మిత్రులను మృదువుగా హెచ్చరిస్తున్నా....

.................

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ మీడియా అంటే అందరికీ ఎందుకంత ఇష్టం అంటే...

  ఈ మీడియా అంటే అందరికీ ఎందుకంత ఇష్టం అంటే...   ‘ ఈనాడు ’ .. ఆసాంతం (కేవలం) చూడాల్సిన పేపర్   ‘ ఆంధ్రజ్యోతి ’ . .. 3 వ పేజీ (ఎడిట్ పేజీ)...